భారత్ నుండి దోచుకున్న విలువైన సంపదను బ్రిటిష్ వారు ఎక్కడ దాచారు
ఒక శతాబ్దం క్రితం బ్రిటిష్ వారు ప్రపంచం లోని చాలా విలువైన భూ భాగాన్ని మరియు దేశాలను ఆక్రమించుకున్నారు. అలా ఆక్రమించుకున్న వాటిలో భారత దేశం ఒకటి.బ్రిటిషర్లు భారత దేశ విలువైన సంపదను కొల్లగొట్టి వారి దేశ మ్యూజియం లో దాచి పెట్టారు.బ్రిటిషర్లు కొల్లగొట్టిన సంపద తిరిగి ఇచ్చేస్తే వారి మ్యూజియం లు కాలీగా ఉంటాయని అప్పట్లో ప్రచారం లో ఉండేది. అప్పట్లో బ్రిటిష్ వారు మన దేశం నుండి దోచుకెళ్లిన సంపదల్లో ముఖ్యమైన వాటిని చర్చిద్దాం . 1 . కోహినూర్ వజ్రం : కోహినూర్ వజ్రం ప్రఖ్యాతి గాంచిన మొగల్ చక్రవర్తి అల్లా ఉద్దీన్ ఖిల్జీ కి చెందినది.1849 వ సంవత్సరం లో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ని ఇండియా లో ఏర్పాటు చేసినప్పుడు కోహినూర్ వజ్రం విక్టోరియా రాణి కి హ్యాండ్ ఓవర్ చెయ్యబడింది.ప్రస్తుతం ఇది లండన్ లోని జ్యుయల్ హౌస్ టవర్ లో భద్రపరచబడింది . 2 . ది రింగ్ అఫ్ టిప్పు సుల్తాన్ : టిప్పు సుల్తాన్ క్రి.శ.1799 సంవత్సరం లో యుద్ధం లో ఓడిపోయినప్పుడు బ్రిటిష్ వారు అతని కత్తి ని మరియి ఉంగరాన్ని అతని శవం నుంచి దొంగిలించుకు పోయారు.తర్వాత కత్తిని ఇండియాకి తిరిగి పంపించినా అయన ఉంగరాన్న...